Posts

Showing posts from December, 2021

30 శాతం ఫిట్మెంట్?

72 గంటల్లో పీఆర్సీ పై తుది నిర్ణయం ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ప్రకటిస్తారని ప్రభుత్వ సియెస్ సమీర్ శర్మ తెలిపారు. ఇది ఇలా ఉండగా పీఆర్సీ కమీటీ ప్రభుత్వవాని కి నివేదిక సమర్పించింది. 27 శాతం ఫీట్మెంట్ కమీటీ ప్రతిపాధించినట్లు తెలుస్తుంది. అయితే 30 శాతం వరకు ఫీట్మెంట్ పెంచాలని జగన్ నిర్ణయించిన్నట్లు సమచారం.

పీసీసీ కొత్త ప్రెసిడెంట్ వేట లో కాంగ్రెస్

Image
కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్ర ప్రదేశ్ పై దృష్టి సారించింది. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ బాధ్యతల ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ కి అప్పగించింది. ఈ మేరకు చాంది ఆంధ్రప్రదేశ్సి కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరి ని విజయవాడ చేరుకోవాలి అని ఆదేశాలు జారి చేశారు. ఈ నెల 21,22 తేదీ ల లో కీలక సమావేశాలు జరుగనున్నాయి.

ముంచుకొస్తున్న థర్డ్ వేవ్

Image
న్యూ ఢిల్లీ, ఆంధ్ర చైతన్య : థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది. ఓమిక్రాన్ రూపం లో మరో సారి కరోనా భారత్ లో పంజా విసరనుంది. రోజు రోజు కి పెరుగుతున్న కేస్ లు ఆందోళన కలిగిస్తున్నాయి. మహా రాష్ట్ర, కేరళ మరియు ఇతర రాష్ట్రాల్లో కేస్ లు భారీ గా పెరుగుతున్నాయి. భవిష్యత్తు లో కేస్ లు మరింత పెరగొచ్చు అని ఇది థర్డ్ వేవ్ కి సంకేతం గా భావించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోవిడ్ నిబంధనలు పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.

నిరసన ర్యాలీలు

Image
ఒంగోలు , ఆంధ్ర చైతన్య : ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ డిమాండ్ల సాధన కి భోజన విరామ సమయం లో తమ పాఠశాలలు, కార్యాలయాల లో నల్ల బ్యాడ్జి ల తో నిరసన ర్యాలీలు నిర్వహించారు. దీని లో భాగం గా ఒంగోలు నగర పాలక సంస్థ ఉపాధ్యాయులు యూటీఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి సి హెచ్ లక్ష్మీ నారాయణ  నాయకత్వం లో వివిధ పాఠశాల లో నిరసన ర్యాలీలు జరిగాయి.  ప్రధాన డిమాండ్లు : 1. పీఆర్సీ తక్షణమే ప్రకటించాలి. 2. డీఏ బకాయిల విడుదల చేయాలి. 3. యాప్ ల భారం తగ్గించాలి. ఒంగోలు లో జరిగిన ఉపాధ్యాయుల నిరసన చిత్రాలు :    పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ ఒంగోలు    డీఆరార్ మునిసిపల్ హై స్కూల్ ఒంగోలు   పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ ఒంగోలు   రామనగర్ మునిసిపల్ హై స్కూల్ ఒంగోలు

ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ థియేటర్స్ లో విడుదల

Image
మార్కెటింగ్ లో దిట్ట అయిన రాజమౌళి  ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ తో అంచనాలను రెట్టింపు చేయాలనే ఆలోచన లో భాగం గా థియేట్రికల్ ట్రైలర్ ను తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లో డిసెంబర్ 9 నా విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ మరియు చరణ్ అభిమానుల కోసం ఆంధ్ర చైతన్య ట్రైలర్ విడుదల కాబోయే థియేటర్స్ లిస్ట్ ని మీ కోసం అందిస్తుంది.

పేదల కోసం 5 శాతం భూమి

అమరావతి, ఆంధ్ర చైతన్య : ప్రైవేట్ లే ఔట్స్ లో పేదల గృహ నిర్మణం  కు 5 శాతం భూమి ని కేటాయిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్సార్ జగనన్న హోసింగ్ ప్రాజెక్ట్ కింద ఈ  ప్రక్రియ అమలు కానుంది. దీని కి సంబంధించిన గెజిట్ ను పట్టణాభివృద్ధి మరియు పురపాలక ప్రత్యేక అధికారి శ్రీ లక్ష్మి సోమవారం విడుదల చేశారు. 

తెలుగు రాష్ట్రల్లో భారీ గా తగ్గిన సిమెంట్ ధరలు

అమరావతి , ఆంధ్ర చైతన్య : నిర్మాణ రంగం లో ఉన్న వారి కి ఇల్లు నిర్మిస్తున్న వారి కి శుభ వార్త. తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు భారీ  గా తగ్గాయి. 50 కిలో ల బస్తా పై 20-40 రూపాయలు తగ్గినట్లు సమాచారం. ఈ ధరల తగ్గింపు తో 50 కిలో ల సిమెంట్ బస్తా 320 మరియు అంత  కన్నా తక్కువ కె ప్రజల కి లభిస్తుంది. ఇది కచ్చితం గా నిర్మాణ రంగం లోని వారి కి మరియు సామాన్యుల కు మంచి శుభ వార్త. 

నేటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

పీఆర్సీ ప్రకటన కోసం ప్రభుత్వ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. నేటి నుంచి నల్ల బ్యాడ్జి ల తో విధులకు హాజరవుతామని ప్రభుత్వ జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమాలు పది రోజులు కొనసాగనున్నాయి. మరో పక్క తిరుపతి లో  వై యెస్ జగన్ పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

పుష్ప ట్రైలర్ విడుదల

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథ నాయకుడి గా ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప థియేట్రికల్ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. పూర్తి చిత్తూర్ యాస తో అల్లు అర్జున్ మాట్లాడటం చాలా కొత్త గా అనిపించింది. చిత్రాన్ని డిసెంబర్ 17 న విడుదల చేస్తున్నట్లు ట్రైలర్ చివరి లో ప్రకటించారు. ట్రైలర్

ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం

బ్రేకింగ్ న్యూస్ ... ఆంధ్ర చైతన్య, అమరావతి: ప్రజల ఆరోగ్యం ని దృష్టి లో ఉంచుకొని ఆంధ్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య హాని కారకాలు అయిన పొగాకు, గుట్కా, పాన్ మసాల లను ఏడాది పాటు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

భారత్ ను భయపెడుతున్న ఓమిక్రాన్

ముంబై, ఆంధ్ర చైతన్య :   ఓమిక్రాన్ చాప కింద నీరు లాగా పాకుతుంది. తాజా గా మహారాష్ట్ర లో మరో రెండు కొత్త కేసులు రావటం నిపునల లో మరియు సామాన్య ప్రజల లో అందోళన వ్యక్తం అవుతోంది. ఒక్క ముంబై మహా నగరం లొనే 10 కేసులు నమోదు అవటం థర్డ్ వేవ్ కు సంకేతం గా నిపుణులు భావిస్తున్నారు. మాస్కులు ధరించంటం, సామాజిక ధూరం పాటించటం మాత్రమే ఈ వైరస్ కి విరుగుడు గా ఆరోగ్య నిపుణులు ప్రజల కు జాగ్రత్త చెబుతున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ ట్రిపుల్ ఐటీ సీట్ల వివరాలు

ఆంధ్ర చైతన్య, ఎడ్యుకేషన్ డెస్క్ : ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కి 4000 సీట్ల కి గాను 466 సీట్లు మిగిలాయని ప్రవేశాల కన్వీనర్ ఆచార్య గోపాల రాజు మీడియా కు తెలిపారు.

సైనిక వికలాంగుల కోసం విరాళాల సేకరణ

ఒంగోలు, ఆంధ్ర చైతన్య : పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాల లో సైనిక వికలాంగుల కోసం విరాళాలు సేకరించడం జరిగింది. సోమవారం పాఠశాలలో ఉపాధ్యాయుల నుంచి, విద్యార్థుల నుంచి, ప్రజల నుంచి సుమారు 20 వేళా రూపాయలు సేకరించారు. ఈ మొత్తాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధిక చేతుల మీదుగా 34వ ఆంధ్రా బెటాలియన్  NCC కమాండింగ్ అధికారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ యం రాధిక మాట్లాడుతూ NCC ప్రభోధిస్తున్న  దేశభక్తి, క్రమశిక్షణ ఆదర్శాలు ఇటువంటి సహాయం అందజేయడం ఒక ప్రతీక అన్నారు. NCC అధికారి పివి నారాయణ ఈ సహాయం అందజేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు.  ఈ విరాళం పాఠశాల విద్యార్థుల, ఉపాధ్యాయుల సంఘీభావానికి, సమైక్యతకు, దేశభక్తి ప్రేరణకు, సైనిక వికలాంగుల  ఆత్మ విశ్వాసాన్ని దోహదపడుతుందన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ మాట్లాడుతులు ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో సాంఘీక సేవా కార్యక్రమాలు చేసేందుకు, దేశ రక్షణకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణయ్య, యస్ వెంకటేశ్వర్లు, జి శ్రీనివాస్, ఎన్ సింగయ్య, ఏడుకొండలు, స్టాలిన్, పద్మావతి, అరుణశ్రీ, శ్రీలక్మి, శోభమణి, భవాని, క...

నిజమైన వార్తలు కచ్చితమైన విశ్లేషనలు

సూటి గా సుత్తి లేకుండా నిజమైన వార్త విశ్లేషనలు మీ ముందుకు తేవటాని కి ప్రయత్నిస్తునామ్. మమ్మల్ని ఆశీర్వదించండి. ధన్యవాదాలు.